India Languages, asked by baludemula108, 7 months ago

‘రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

Attachments:

Answers

Answered by poojan
8

'రాజు రివాజులు బూజు పట్టగన్'  అనే ఈ పంక్తి దాశరధి కృష్ణమాచార్యులు రచించిన రుద్రవీణ లోనిది.  

పంక్తి యొక్క అర్థం :

'రాజు రివాజులు బూజు పట్టగన్' అనగా 'ఉద్రిక్తలు కల్గించిన  నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది' అని అర్థం.  

పద్యం :

నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క  

ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం  

ద్రాలకు దారినిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా

రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్!

తాత్పర్యం :

తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గువైపుల నుండి  సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తలు కల్గించిన  నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది.

Learn more :

1) మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.

brainly.in/question/14590444

2) సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి .

brainly.in/question/16289469

Similar questions