India Languages, asked by csailaja83, 1 month ago

చాకలి గురించి రాయండి​

Answers

Answered by Hema266
4

Hey mate !!

Here is ur Answer ⤵️

కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందర అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా

దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తమంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య , మాచయ్యలు. మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.

మాచయ్య పటం కథ : మడేలయ్య తెచ్చుకున్న అన్నాన్ని మాచయ్య తిన్నవాడు కాబట్టి ఆయన వంశస్తులు పటం సహాయంతో చాకలివారికి స్థంభపురాణం, పార్వతీ కళ్యాణం, దక్షయజ్ఞం, మడివేలు పురాణం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెప్తారు. ఈ పటంని వరంగల్‌ జిల్లా, చేర్యాల గ్రామంలో తయారు చేస్తారు. ఈ నకాశి చిత్రకారులు నాలుగు అడుగులు వెడల్పు ఆరుగజాల నుండి ఇరవై గజాల పొడవు ఉన్న నూలుగుడ్డను తడిపి దానికి గంజి రాసి ఆరిన తరువాత తిరిగి చింతగింజల గంజి రాసి ఎండబెడుతారు. తరువాత తాము స్వయంగా స్పటికాల రాళ్ళతో మసి, పిడకల బొగ్గు, తరకి చెట్టు బంకతో కలిపి తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు వేస్తారు. వేదిక : కథ చెప్పే ప్రదేశంలో వెడల్పు ఎనిమిది అడుగులు, పొడవు అయిదు అడుగులు ఉండేవిధంగా ఒక నాలుగు గుంజల పందిరి చేస్తారు. రంగస్థలం వెనుక భాగంలో తెల్లని పరదా గుడ్డ కడతారు. రంగస్థలం వెనుక భాగంలో తెల్లని పరదా గుడ్డ కడతారు. ముందు భాగానికి పైన కుచ్చుల పరదాతో అలంకరిస్తారు. వెనుక తెల్ల పరదా దగ్గర మరి రెండు గుంజలు నాటి గుంజల పైన చుట్టిన పటం కడతారు. కథ చెప్పేటపుడు ఈ పటంను పై నుండి క్రిందకు లాగుతూ ఉంటారు. ఈ విధంగా లాగుతున్నపుడు ఒక క్రమపద్ధతిలో కథకు అనుకూలంగా దృశ్యాలు వస్తుంటాయి. అదేవిధంగా కథ చెపుతున్నపుడు తప్పకుండా రాగిసన్నత్‌ ఉంటుంది. రాగి సన్నత్‌ రంగస్థలం మీద లేకుండా కథ చెప్పనివ్వరు. పటం దగ్గర కథ చెప్పే వ్యక్తి నిలబడి ఉండగా, ఎడమవైపుగా ఒక పక్కన వంతలు, వాద్యకారులూ ఉంటారు. కథకుడు చేతి బెత్తంతో పటం చూపుతూ కథను వచనంగాను, పాటగాను రాగయుక్తంగా వివరిస్తుంటే వంతలు వాద్య సహకారం ఇస్తూ వంతపాడుతూ కొనసాగిస్తుంటారు. మధ్య మధ్యన కథకుడు ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడానికి ఎగరడం, హాస్యపు మాటలు చెప్పడం చేస్తుంటారు. కథకుడు చేతిలో బెత్తం, కాళ్ళకు గజ్జెలు, మెడకు రుమాలు, చేతికి వెండిపొంచి చెవులకు కుండలాలు, భుజాలపైకి పడుతున్న జుట్టుతో మెడలో వెండి గొలుసులతో హుందాగా కనిపిస్తాడు. కథ మొదటి రోజు మొదలుపెట్టే ముందు ఊదుబత్తి ముట్టించి, కొబ్బరికాయ కొట్టి పటాన్ని క్రిందికి దించి మొదలుపెడతారు. పటంపై వైపున కడతారు. కాబట్టి పై నుండి క్రిందకు ఒక దృశ్యం తరువాత మరొక దృశ్యాన్ని లాగవలసి ఉంటుంది. పనుల కాలంలో ఎక్కువగా రాత్రిపూట కథ చెప్తారు. మాగి రోజుల్లో కూడా రాత్రిపూట చెపుతుంటారు. పనులు లేని తీరిక కాలంలో గ్రామాల్లో సంచార జీవనం చేస్తూ కథలు చెపుతుంటారు. పూర్వం గుర్రాలు ఉన్నపుడు గుర్రాల మీద సామాన్లు వేసుకుని వెళ్లేవారట. చాకలివారు ఇంటి పట్టునే వీళ్లు కూడా చూరు క్రింద ఆశ్రయం పొందుతారు. ఆ గ్రామంలో ఉన్నన్ని రోజులూ మాచయ్యలను పోషించాల్సిన బాధ్యత ఆ చాకలి కులస్థులదే. కథ మొదలు పెట్టే ముందు స్నానం చేసి శుచిగా రంగస్థలం వద్దకు వచ్చి ముందు ఊదుబత్తులు ముట్టించి కొబ్బరి కాయ కొడతారు. ప్రేక్షకులకు కుంకుమ బొట్లు పెడతారు. తరువాత ఓంకార్‌ విరాట్‌ తో కథ ప్రారంభిస్తారు. ఓంకార్‌ విరాట్‌ సృష్టి కర్త. భూమి ఆకాశం చిమ్మచీకట్లలో ఉన్నపుడు ఓంకారి విరాట్‌ మిణుగురు పురుగుగా అవతరిస్తాడు. ఈయనకు ఎడమవైపుగా ఆది మహాశక్తి వెయ్యి హస్తాలతో వెయ్యి ఆయుధాలతో నిలబడి ఉండగా కుడివైపున ఆది బసవేశ్వరుడు ఉంటాడు. ఈ విధంగా ప్రారంభమైన శివపురాణంకు సంబంధించిన కథలు ఒక క్రమపద్ధతిలో చెప్పబడుతుంటాయి. వీరి కథలు వినడానికి అన్ని కులాల వారు వీలును బట్టి వస్తుంటారు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత మంగళహారతిలో ప్రేక్షకులు డబ్బులు వేసి మాచయ్యల వద్ద దీవెన పొందుతారు.

Hope it helps you ✌️

Thank you ❣️

Answered by sriteja2780
1

Explanation:

HI friend ╭☞

కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తమంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య , మాచయ్యలు. మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.

HOPE IT IS HELPFUL TO YOU AND MARK ME AS A BRAINLIST FRND

Similar questions