India Languages, asked by thabetiharshith2, 6 hours ago


"సహజకవి” పోతనను పరిచయం చేయండి.​

Answers

Answered by kishoryadav61082
0

Answer:

Mark as brainlist

Explanation:

బమ్మెరా పోథనా(1450–1510) భారతీయ తెలుగు కవి,భగవత పురాణాన్ని సంస్కృతం నుండి తెలుగుకుఅనువదించడానికి ప్రసిద్ది చెందారు.అతను తెలుగు మరియు సంస్కృత పండితుడు.అతని రచన, ఆంధ్ర మహా భాగవతము, తెలుగులో పోథనా భాగవతం అని ప్రసిద్ది చెందింది వీరు నేటి జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామములో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.వీరి అన్న పేరు తిప్పన.వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.

భాగవత రచన

ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడం తో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11 మరియు 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది

Similar questions