English, asked by karthikeyag2006, 6 months ago

1. తన అన్నను వధించేందుకు సుగ్రీవుడు చేసిన ప్రయత్నాలేవి?​

Answers

Answered by Anonymous
5

Answer:

హనుమంతుని కార్యసాధనాపాటవం వలన సీత జాడ తెలిసింది. తన అన్వేషణలో హనుమంతుడు రామలక్ష్మణులకు, వారికి విధేయుడైన సుగ్రీవునకు జయం ఘోషించాడు. లంకా నగరం ధ్వంసమైంది. రామలక్ష్మణసుగ్రీవులు రావణునిపై యుద్ధానికి నిశ్చయించారు. యుద్ధకాండలో సుగ్రీవుని ధీరత్వమూ, మిత్ర ధర్మమూ, నాయకత్వమూ చాలా ఉదాత్తంగా చూపబడ్డాయి. సీత దుస్థితి విని విచారిస్తున్న రాముని సుగ్రీవుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిశగా పయనించింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. సాగర తీరం చేరిన వానరసేన మరొక సాగరంలా ఉంది. తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు.

సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో జరిగింది. యుద్ధానికి ముందురోజు సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్ళి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్కగెంతున తిరిగి వచ్చేశాడు.

"జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః" అని కపి సేన లంకను ముట్టడించింది. మొదటిరోజు జరిగిన భీకరయుద్ధం చివరిలో ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులు వివశులయ్యారు. అందరూ హతాశులయ్యారు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి నాగపాశాలనుండి విముక్తులను చేశాడు. యుద్ధంలో అంగదాది మహావీరులతో కలిసి విజృంభించిన సుగ్రీవుడు ఎందరో రాక్షసులను చంపేశాడు. కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. కుంభుడు సుగ్రీవుని పిడిగుద్దులతో హతుడయ్యాడు. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. ఇంకా ఎందరో రాక్షసులు సుగ్రీవుని చేత హతులయ్యారు.

PLZ FALLOW BACK.....

Answered by Anonymous
4

Answer:

వాలి కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించాడు; అతని ప్రజలు వనారాలు. తారా అతని భార్య. ఒక రోజు, మాయావి అనే రాగి రాక్షసుడు రాజధాని ద్వారాల వద్దకు వచ్చి వాలిని పోరాటానికి సవాలు చేశాడు. వాలి సవాలును అంగీకరించాడు, కాని అతను ముందుకు సాగినప్పుడు, దెయ్యం తీవ్ర గుహలోకి భయభ్రాంతులకు గురైంది. సుగ్రీవుని బయట వేచి ఉండమని చెప్పి వాలి రాక్షసుడిని వెంబడిస్తూ గుహలోకి ప్రవేశించాడు. వాలి తిరిగి రానప్పుడు మరియు గుహలో దెయ్యాల అరుపులు విన్నప్పుడు మరియు దాని నోటి నుండి రక్తం కారడం చూసినప్పుడు, సుగ్రీవుడు తన సోదరుడు చంపబడ్డాడని నిర్ధారించాడు. భారమైన హృదయంతో, గుహ ప్రారంభానికి ముద్ర వేయడానికి సుగ్రీవుడు ఒక బండరాయిని చుట్టేసి, కిష్కింధకు తిరిగి వచ్చి, వనారాలపై రాజ్యపాలన చేపట్టాడు. అయితే, వాలి చివరికి రాక్షసుడితో పోరాడి విజయం సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా వ్యవహరించడం చూసి, తన సోదరుడు తనకు ద్రోహం చేశాడని నిర్ధారించాడు. సుగ్రీవుడు వినయంగా తనను తాను వివరించడానికి ప్రయత్నించినప్పటికీ, వాలి వినలేదు. తత్ఫలితంగా, సుగ్రీవుడు రాజ్యం నుండి బహిష్కరించబడ్డాడు, వాలి బలవంతంగా సుగ్రీవుడి భార్య రూమేను తీసుకున్నాడు మరియు సోదరులు చేదు శత్రువులు అయ్యారు. సుగ్రీవుడు రిష్యాముఖ్ మీద నివసిస్తున్నాడు, ఎందుకంటే వాలి నడవలేని భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం ఇది. వాలిని గతంలో సేజ్ మాతాంగ్ శపించాడు మరియు అందువల్ల ఈ భూమిపై అడుగు పెట్టలేడు. అలా చేయడం వల్ల అతని మరణానికి కారణం అవుతుంది....

thank you✌✌

Similar questions