Math, asked by mohanraorampeesa123, 4 months ago

1.మీ పొలంలో / మీ గ్రామంలో పండిన పంటలకు విత్తనాలు ఎక్కడ నుండి సమకూరుస్తారు?​

Answers

Answered by padmamaloth1986
1

Answer:

Step-by-step explanation:

భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది. కరువు ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టు బాటు కాని వ్యవహారంగా తయారైనది. అటు వంటి ప్రాంతాలలో బక్క రైతులు వ్యవసాయం చేయలేక ఇతర వ్యాపకాలకు మళ్లుతున్నారు. పెద్ద రైతులు దైనందిన వ్యవసాయం పక్కన పెట్టి సావకాశంగా పనులు చేసుకునే........... నీరు తక్కువ అవసరం అయ్యే పండ్ల తోటలు వంటి వాటి పై మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా పల్లెల్లో సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. "ఆప్యాయతకు, అనురాగానికి, ఆనందానికి, పల్లెలే పట్టు గొమ్మలు" అనే మాటకు అర్థం లేకుండా పోతున్నది. పల్లెల్లో ఆలనాడు అనగా 1950 నుండి 1965 వరకు రైతులు, రైతు కూలీలు మొదలగు పల్లె వాసులు నివసించిన గృహాలు, పంటలు పండించే విధానము, వారు వాడిన పరికరాలు / పని ముట్లు రాను రాను కనుమరుగౌతున్నవి. వాటిని ఈ తరంవారు ప్రత్యక్షంగా చూడాలంటే అంత సులభంకాదు. ఏ పుస్తకాలలోనో, సినిమాలలోనో చూడ వలసిందే తప్ప వేరుమార్గం లేదు. ఆ పనిముట్లను, వాటిని వాడే విధానాన్ని, వాటి ఉపయోగాన్ని తెలియ జేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. అంతే గాక ఆనాటి సామాజిక జీవన విధానము ఎలా వుండేది, పల్లె ప్రజలు ప్రతి విషయంలోను ఒకరికొకరు ఏవిధంగా సహకరించుకునేవారు, వారి అన్యోన్యత ఎలా ఉండేది, ప్రస్తుత పల్లెవాసుల జీవన విధానము ఎలా ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, ప్రత్యక్షంగా చూసి వ్రాసిన వ్యాసమిది. కాలానుగుణంగా ప్రాంతీయతను బట్టి కాస్తంత తేడా ఉండొచ్చు. అంతే గాని అన్ని విషయాలలోను ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ఆ విషయాన్ని చెప్పేదే ఈ వ్యాసం. ఒక విధంగా ఈమార్పును పురోగమనమే అనవచ్చునేమో. రాజకీయంగా సాధారణ ప్రజలు చాలా చైతన్యం పొందారు. విద్యవిషయంలో ప్రజలు చాల పురోగతిని సాధించారు. సామాజికంగా కూడా కొంత అభివృద్ధి సాధించారు. దాని ప్రభావమే ఈ మార్పు.

Similar questions