Social Sciences, asked by swetharajnagula632, 29 days ago


పాముల పర్తి వేంకట నరసింహారావు కవిగా, అనువాదకుడుగా, పాత్రికేయుడుగా, కథకుడిగా, నవలా
రచయితగానే కాకుండా 14 భాషలు మాట్లాడ గల్గిన బహు భాషావేత్తగా సుపరిచితులు. 1983 లో న్యూఢిల్లీలో
జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రోను
అబ్బురపరిచిన ధీశాలి. పి.వి. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే ఐనా భూస్వామ్య పోకడలకు దూరంగా తనకు
వారసత్వంగా సంక్రమించిన భూమిలో 50 ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానమిచ్చి తన ఔదార్యాన్ని
చాటుకున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరితార్థుడైన పి.వి.
నరసింహారావు జీవితం చిరస్మరణీయం.
ప్రశ్నలు :-
1. భూదానోద్యమంలో దేనిని దానమిస్తారు?
ఎ) బంగారాన్ని
(బి) భాషను
సి) భూమిని
(డి) అవయవాలను
2. పి.వి. నరసింహారావు ఎన్ని భాషలు మాట్లాడగలరు?
ఎ) 13
(బి) 12
3) 14
(డి) అన్ని భాషలు
3. ఫెడల్ క్యాస్ట్రోను అబ్బుర పరిచిన విషయం
ఎ) పి.వి. హిందీలో మాట్లాడటం
(బి) పి.వి. స్పానిష్ మాట్లాడటం
సి) పి.వి. తెలుగులో మాట్లాడటం
(డి) పైవన్ని భాషలో మాట్లాడటం
4. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది?
ఎ) 1982
(బి) 1983
సి) 1985
(డి) 1984
5. పై పేరాను బట్టి పి.వి. నరసింహారావు
ఎ) కవి, కథకుడు
(బి) నిరంకుశవాది
సి) క్యూబా అధ్యక్షుడు
(డి) పేదవాడు​

Answers

Answered by babu7713
2

Answer:

1. c

2.14

3. b

4. b

5.a

please mark my answer as brainliest answer

have a nice day

Similar questions