2. Find the HCF of 46,24,34.
Answers
Step-by-step explanation:
hope this is helpful.......
Step-by-step explanation:
వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు.
వేమన శతకం
కవి పేరు:
వేమన
వ్రాయబడిన సంవత్సరం:
సుమారు 1652 - 1730 మధ్య కాలము
దేశం:
భారత దేశము
భాష:
తెలుగు
మకుటం:
విశ్వదాభిరామ వినురవేమ
విషయము(లు)
లోక నీతులు. సామాజిక చైతన్యం
పద్యం/గద్యం
పద్యములు
ఛందస్సు
ఆటవెలది పద్యములు
మొత్తం పద్యముల సంఖ్య
100 కి పైగా
అంతర్జాలం లో
వికీసోర్సు లో వేమన శతకం
శతకం లక్షణం
సామాజిక చైతన్యం
వేమన
“విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసినా అస్పష్టంగా వుంది.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలది తో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.
జీవితం:
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1352 – 1430 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.
వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
నందన సంవత్సరమున
బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్
బృందార కాద్రి సేతువు
నందున నొక వీర వరుని జన్మము వేమా!
బృందారక =ఘనమైన
అద్రి=కొండల
సేతువు = సముద్రాన్ని కానీ , నదిని కానీ రెండుగా చీల్చేది (భూమి). (రామ సేతు మనకు శ్రీలంకకు మధ్య నున్న సముద్రాన్ని చీలుస్తూ నిర్మించినది . )
పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు. రెండు కొండలను నడుమ నుండి పారే నదులు మనకు చాల ఉన్నాయి , ఉదాహరణకు కృష్ణ నది. కానీ అవి సేతువు ఏర్పరచలేదు . మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది వైఎస్ఆర్ జిల్లాలో వేంపల్లి కి దగ్గరలో నున్న “గండి” లో “వీరన్న గట్టు పల్లి” అనే గ్రామం వేమన గారి జన్మస్థలం. పాపాగ్ని నది ఇ క్కడి శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. వేమన జన్మస్థలం వీరన్నగట్టుపల్లి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది.
ప్రాచుర్యంలో ఉన్న మరో ఇతివృత్తం ప్రకారం వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.
1820 లో మద్రాసు గవర్నర్ గా నియమితులైన ‘సర్ థోమస్ మన్రో’ గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలో నున్న గండికి ప్రవేశించారు. అక్కడ ఆయనకు బంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా , వారెవ్వరకు ఆ తోరణాలు కనిపించలేదు. ఆయన అక్కడున్న వాళ్ళతో “ఇక్కడో రాజాధి రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి” అన్నారు. వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరు లేరని తేల్చారు కానీ, థోమస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాల రోజులు ఉన్నారు. గండి లో నున్న శ్రీ ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బంగారు తోరానికి కారణం అని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. కానీ అక్కడకు కొన్ని గజాల దూరంలో నున్న వీరన్న గట్టు పల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు. అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవి కావచ్చు, ఆయన ఆత్మ స్వరూపం నుండి వచ్చినవి కావచ్చు. విచిత్రం ఏమిటంటే, ఈ బంగారు తోరణాలు కనిపించిన ఆరు నెలల్లో మన్రో గారు చనిపోయారు. పాములకు, సిద్దులకు తెలిసి కానీ తెలియకకాని కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకంలో నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో ఆణువణువూ పరిశీలించడం ఆ మహా యోగికి బహుశ నచ్చివుండలేదేమో.