Math, asked by adiadinarayana9, 8 months ago

ఒక రైతు రెండు ఎడ్లను ఒక్కొక్కటి ₹ 24000 కు అమ్మెను. ఒక దానిపై 25% లాభాన్ని, రెండవదానిపై20%
నష్టాన్ని పొందితే మొత్తం మీద అతనికి లాభమా? నష్టమా? ఎంతశాతం?​

Answers

Answered by Anonymous
0

Answer:

శంకర్‌ కాటేకర్‌ సన్నకారు రైతు. వర్షాధారం మీద పత్తి పండిస్తున్నాడు. సకాలంలో వానలు లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అలాంటి సమయంలో సర్కారు ఆ ప్రాంతంలో కొన్ని బావులు మంజూరు చేసింది. అలా శంకర్‌ పొలంలో కూడా ఒక బావిని తవ్వితే, అతడి అదృష్టం బాగుండి పది అడుగులకే నీళ్లు పడ్డాయి. అలా రెండేళ్లపాటు సాగునీటికి లోటు లేకుండా వ్యవసాయం చేశాడు.

ఆ తరువాత బావి ఎండి పోయింది. కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంకాస్త లోతు తవ్వితే నీరొస్తుందన్న ఆశతో అధికారుల చుట్టూ తిరిగాడు. వారు పట్టించుకోలేదు. ప్రభుత్వ నిధులతో అంతకు మించి తవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవన్నారు. దాంతో బంధువుల దగ్గర అప్పు చేసి 10 అడుగుల వరకు తవ్వాడు. కానీ, నీళ్లు పడలేదు. పంటలు పండక నష్టం వచ్చింది. అప్పులిచ్చిన వారు వెంట పడ్డారు. దిక్కుతోచని శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలానికి, మహారాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంలో తొలివిడతగా నలభైవేల రూపాయలను ఆ రైతు భార్య అంజన చేతిలో పెట్టింది. ఆ డబ్బుతో ఆమె బావిని బాగుచేసుకొని సాగు చేస్తున్నారు.

'ఆ నలభై వేలను సర్కారు ముందే ఇస్తే బావి బాగుపడేది, నా భర్త నాకు దక్కేవాడు కదా?' అని అంటారు అంజన.

ఇలాంటి కథనాలతో మొదలవుతుంది 'విడోస్‌ ఆఫ్‌ విదర్భ' అనే పుస్తకం. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని రైతు కుటుంబాల జీవిత వ్యథలను తెలిపే పుస్తకం ఇది.

స్వతంత్ర పరిశోధకురాలు, రచయిత్రి నీలిమ దీన్ని రాశారు. విదర్భ రైతుల సమస్యలకు తెలంగాణ రైతుల స్థితిగతులకు మధ్య ఎన్నో సారూప్యాలున్నాయి. తెలంగాణలో సాగు సమస్యలు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా నీలిమ బీబీసీతో చెప్పిన విషయాలు:

Similar questions