CBSE BOARD X, asked by Rudhraa, 1 year ago

Any telugu person....give me speech in our nation in telugu


swethapavs: about wt u want?yaar

Answers

Answered by dounthulasharath
0
69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారాయన. గణతంత్ర రాజ్యంగా ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించిన భారత దేశం 2022 నాటికి మరెన్నో విజయాలను సాధించేందుకు ఉరకలెత్తుతోందన్నారు.


దేశంలోని విద్యావ్యవస్థలో సంస్కరణలు రావాల్సివుందని, డిజిటల్‌ ఎకానమీ, జెనోమిక్స్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌‌ను అందుబాటులోకి తేవాల్సివుందని అన్నారు. జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారని యువతే దేశ ప్రగతికి ఆయుధం అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించాలన్నారు.

గణతంత్ర దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశం కోసం, దేశ రక్షణ కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. భారత స్వాతంత్య్రానికి రాజ్యాంగ రూపకల్పనకు కృషి చేసిన ఎందరో మహనీయులను ప్రతి పౌరుడు గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుకి అండగా నిలబడాలన్నారు. కన్నతల్లి బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతుందో ఆ రీతిలో రైతుకి అండగా ఉండాలన్నారు. ఉగ్రవాదం కారణంగా దేశంలో అశాంతి నెలకొందని.. వసుదైక కుటుంబం అనే భావన ఉగ్రవాదం కారణంగా సాధ్యపడటం లేదన్నారు. సుస్థిరాభివృద్ధి దిశగా దేశం పయనించాలని ఆకాంక్షించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.


I hope it helps u bro
Answered by CreAzieStsoUl
2

Answer:

______££££££______&&&&&&&

Similar questions