India Languages, asked by gireshsharma2005, 5 months ago

Make a pamphlet on Gandhi jayanti in Telugu language​

Answers

Answered by rmvilohit
2

Answer:

సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. వేల మంది నాయకులు బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు పోరాడినా.. గాంధీకి మాత్రం విశిష్ట గౌరవం దక్కింది. అందుకు ఆయన ఎంచుకున్న అహింస మార్గమే అందుకు కారణం. ఆయన జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరినో తన ఉద్యమస్ఫూర్తిని రగిల్చారు మహాత్ముడు. 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించిన గాంధీ దేశానికి స్వాతంత్య్రం సాధించిన కొంత కాలానికి హత్యకు గురయ్యారు. ఈ ఏడాది మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన బాపు జీవిత సత్యాలు, ముఖ్యమైన సూక్తులు మీకోసం..

Explanation:

Similar questions