Math, asked by Madhu1105, 1 month ago

ఒక భారమార సమస్యలో ఒక విద్యార్థి
విభాజకమును బదులుగారిగా
తీసుకొని, భగఫలముకుగా కనుగొన్నాడు.
పొరబాటున
అయిన విభుజం
విభాజ్యం ఎంత?​

Answers

Answered by SidMistry
0

Answer:

సరిగా మూడు సంవత్సరాల క్రితం మన నుండి భౌతికంగా సి. వి. (చిత్తజల్లు వరహాల రావు) దూరమయిన వారంలోగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వారు 'మన తరం ప్రజాస్వరం' గా ఆయనపై  ఒక గొప్ప జ్ఞాపికను (15-11-2017 నాడు) వెలువరించారు.  ఆయన రచనలన్నిటినీ  24 సంపుటాలుగా ఒకేరోజు (2015 జూన్‌ 28) న ఆవిష్కరించటమే కాక ఒక అపూర్వ పౌర సన్మానాన్ని సాహిత్య, సాంస్కతిక, సామాజిక సంస్థలు అనేకం కలిసి విజయవాడలో నేను కన్వీనర్‌గా  నిర్వహించాము.

ఆ రోజుని  'నిప్పుకి  నివురు  తొలుగుతున్న వేళగా' అభివర్ణిస్తూ ఆ సభలోనే 'సమరశీల కలం యోధుడు సి.వి.' అనే సి.వి. రచనలపై విశ్లేషణాత్మక గ్రంధాన్ని జనసాహితి తమ 'ప్రజాసాహితి' మాస పత్రికలో సివిపై వెలువడిన రచనలన్నిటినీ  కలిపి ప్రచురించిన 240 పుటల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. మొదటి వర్ధంతికి (8-11-2020) ఆయనపై ప్రసంగాలను ఇప్పించారు. రెండవ వర్ధంతికి 1975లో సివి  రచించిన, కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్యగారు పుస్తకం ప్రచురణ దశలో వుండగానే ప్రజాశక్తిలో సమీక్ష  రాసిన,   500 పేజీల మహా కావ్యం

''పారిస్‌ కమ్యూన్‌''పై వెలువడిన సమీక్షలనన్నిటినీ కలిపి ఒక 'ఇ-బుక్‌ 'ను జనసాహితి తెచ్చింది. కరోనా  నడిమధ్యన సి.వి. నేటికీ  అవసరమంటూ మూడవ వర్ధంతి వచ్చింది.''దేశాన్ని అమావాస్య ఆవహించింది

అధికారం అవినీతికి దారితీసింది

 హద్దూపద్దూలేని నిరంకుశాధికారం

 అంతూపంతూ లేని అవినీతికి మార్గం వేసింది''

ఈ మాటలు నేటివేనని అనుకునేట్లున్నా, సరిగా 55 ఏళ్ల క్రితపు 'విషాదభారతం' కావ్యంలోనివని తెలిస్తేగానీ

'సివి' దార్శనికత మనను అబ్బురపరచదు.

''మధ్య యుగాల్లోకి మళ్ళీ వెళ్ళి మనం జీవిస్తున్నామా  అనేంతటి తీవ్రమైన సందేహం నేడు కలుగుతోంది.'' అని కూడా 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ' లో (రచన 1980)  ఆయన రాశారు. రానున్న ప్రమాదాన్ని ఎంత ముందుగా కనుగొని హెచ్చరించాడా అనిపించే మాటలవి!  

మార్క్సిస్ట్‌ థియరీని 'వ్యక్తి భౌతిక అస్థిత్వానికే పరిమితం' చెయ్యటం తెలివితక్కువతనమే కాదు, నీచం కూడా. ఎకనామిక్‌ డిటర్మినిజమ్‌' అనే చెత్త విమర్శకి మార్క్సిస్ట్‌ థియరీ కచ్ఛితంగా నోచుకోదు. మార్క్సిస్ట్‌ తత్వం వ్యక్తి భౌతిక అస్తిత్వానికే పరిమితమై లేదు. దాన్ని మించి చాలావుంది. అది మన జీవితాన్ని చూస్తుంది. మనం ఎలా బతుకుతున్నామో గమనిస్తుంది. మనం ఏం ఉత్పత్తి చేస్తున్నామో, దేంతో

ఉత్పత్తి చేస్తున్నామో, దాని ఎడ మన వైఖరేంటో, ఉత్పత్తి పంపిణీల్లో మన సామాజిక అవగాహనేంటో, ఆ క్రమంలో మనుషుల మధ్య సామాజిక, సాంస్కతిక, మానసిక అంశాలు ఎలా ముడిపడి వున్నాయో అంటే యివన్నీ ఆర్థికాన్ని (ఎకానమీని) ఏ విధంగా రాజకీయం చేస్తుందీ, అంతేగాక

ఉత్పత్తిలో జోక్యం, కార్మిక విభజన (డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌), ఆస్తి రూపాలు (తెగల, పురాతన, భూస్వామ్య లాంటివి) వీటిని పై కాల, భౌగోళిక, సాంకేతిక మార్పులు ఎలా శక్తివంతంగా పని చేస్తాయో రాజకీయ ఆర్ధికం (మార్క్సిస్ట్‌ పొలిటికల్‌ ఎకానామీ - మార్క్సిస్ట్‌ తత్వం) నొక్కి చెప్తుంది.

అందుకే మార్క్సిజాన్ని , సమాజాన్ని, చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సి. వి. 2015 లో శాంతిశ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మనదేశంలో  రాజకీయ మార్పుకి సమాంతరంగా సాంస్కతిక మార్పు అవసరమని మార్క్సిస్టులు గుర్తుంచుకోవాలి' అంటాడు. ఒక విధంగా మమేకమైన ఈ రెండు విషయాల్ని నొక్కి చెప్పవలసి వచ్చిందంటే సివికి మార్క్సిస్టు ఉద్యమాలపై గల అసంతప్తికి ఒక వ్యక్తీకరణ అనుకోవాలి.  

ఇదే విషయాన్ని సి.వి. 17-6-2015న  'ప్రజాసాహితికి జేజేలు' అంటూ  రాసిన తన చివరి వీలునామా లాంటి  లేఖలో మరింత స్పష్టంగా ఇలా  చెప్తారు. ''కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మతతత్వంపై మరోసారి, దున్నేవానికే భూమికి,   రాజ్యాధికారానికీ  వేరొకసారి ... ఇలా ఉద్యమాలు పోరాటాలు వేటికవి విడివిడిగా ఉండవేమోనని నేననుకుంటున్నాను.'''

తెలుగు వారికి లభించిన అరుదైన ప్రజారచయిత సి.వి. 'యుగయుగాల భారత శ్రామిక వర్గ చరిత్రయే దళిత చరిత్ర' అంటూ నిర్ధారించకలిగిన రాజకీయ అవగాహన సి.వి. కుంది. మనుస్మతి అమల్లోకొచ్చి నేటికి 2 వేల సంవత్సరాలు దాటిపోయింది. అయినా మన మానసిక, సాంస్కతిక, సాహితీ, సాంఘిక రంగాల్లో ఈ స్మతి ప్రభావం విరగడకాని పీడలా, భయంకరమైన నీడలా మనల్ని నేటికీ వెన్నాడుతూనే వుంది' అని సి.వి. ''మనుధర్మశాస్త్రం శూద్ర దళిత బానిసత్వం'' లో వాపోతూ 'ఇండియాలోని ఏడు లక్షల మాలపల్లెల్లో ఈ మనుస్మతి గురించి విశ్లేషించండి' అని చెప్తారు. ఇది అవసరం. ఆయన 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ' లో ''వైజ్ఞానిక దష్టికి బదులు అంధమత విశ్వాసం, హేతుబద్ధమైన ఆచరణకి బదులు నిర్జీవ కర్మకాండ, మానవ సహజమైన  జిజ్ఞాసకి బదులు గొర్రెదాటుడుతత్వం, భావస్వాతంత్య్ర రాహిత్యం, అవినీతి, నైతిక విశంఖలత్వం దేశంలో  పైశాచిక తాండవం చేస్తున్నాయి' అని అద్దాన్ని చూపిస్తాడు.

అంతే కాకుండా కుల వ్యవస్థ పుట్టుకను దాని కొనసాగింపునీ  ఇలా విప్పి చెపుతాడు.

''వర్ణ వ్యవస్థ (ఆధునిక కులవ్యవస్థ ) కేవలం వత్తి ఆధారంగా నిర్ణయించ బడింది. పురాతన కాలంలో కుటుంబ వత్తినే అన్ని  తరాలు అనుసరించటం వలన అది వారిని అదే వర్గంలో ఉండేలా చేసింది. కానీ మధ్య యుగాలు, ఆధునిక యుగంలో ఆయా కుటుంబాలలో పుట్టడమనేది ఆయా కులాలను నిర్ధారిస్తుంది.''

ఈ మాటలు కూడా  40 యేళ్ళ క్రితపు 'ఆధునిక కులవ్యవస్థ' లో సివి రాశారు.            

Similar questions