India Languages, asked by ramanabarlanka67, 2 days ago

Lakshmanudu pathra Sva Bhawani gurinchi rayandi​

Answers

Answered by rajesh205
2

Explanation:

రామాయణం అనగానే జగదభిరాముడైన శ్రీరాముని చరితమే గుర్తుకువస్తుంది. కానీ శ్రీరామునికి అడుగడుగునా అండగా నిలిచి, కర్తవ్య పాలనలో సహకరించిన లక్ష్మణుడి పాత్రా తక్కువేమీ కాదు. అందుకే సీతారాములతో పాటుగా రాముని నిరంతరం తల్చుకునే హనుమంతుడు, ఆయననే సతతం కొలుచుకునే లక్ష్మణుడు యుగయుగాలుగా పూజలందుకుంటున్నారు.

రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడేమో ఆదిశేషుని అవతారం. దశరధుని ఇంట కౌశల్యకు రాముడు. సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. బాల్యం నుంచి రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుని వెంట వెళ్లినా, సీతాస్వయంవరంలో శివధనుసుని చేపట్టినా.... రాముని వెంటే ఉన్నాడు లక్ష్మణుడు. అందుకే సీతాస్వయంవరంలో రామునికి సీతమ్మ చేతిని అందిస్తే, లక్ష్మణుడికి ఆమె చెల్లలు ఊర్మిళను ఇచ్చి వివాహం చేశారు. అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు తోడల్లుడు కూడా!

చెప్పుడు మాటలు విన్న రాముని సవతి తల్లి కైకేయి, రాముని అడవులకు పంపే వరాన్ని దశరధుని నుంచి అందుకుంటుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడుగా రాముడు, భర్తను అనుసరించే భార్యగా సీతాదేవి వనవాసానికి బయల్దేరతారు. కానీ తన సంసారాన్ని వదిలి లక్ష్మణుడు వారి వెంట సాగడం అసాధారణం. అడవులకు వెళ్లడమే కాదు, అక్కడ శ్రీరాముని నిరంతరం కాచుకుని ఉండేందుకు 14 ఏళ్లపాటు నిద్రలేకుండా ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు లక్ష్మణుడు. అందుకోసం లక్ష్మణుని భార్య ఊర్మిళ, 14 ఏళ్లపాటు లక్ష్మణుడి నిద్రను కూడా తానే అనుభవిస్తుంది. ఇక వనవాసంలో ఉన్న రాముని పట్ల మోహితురాలైన శూర్పనఖ ముక్కుని లక్ష్మణుడు ఖండించడంతో, రామరావణ యుద్ధానికి బీజం పడుతుంది. ఆ తరువాత లక్ష్మణుడు గీసిన లక్ష్మణరేఖను జవదాటినందుకు సీతను రావణుడు అపహరించే అవకాశం చిక్కుతుంది. ఇలా రామాయణంలో అడుగడుగునా లక్ష్మణుని పాత్ర కథను ముందుకు నడిపిస్తుంది.

Your from andhra know ?

my name rajesh

Similar questions