India Languages, asked by StarTbia, 1 year ago

223. భిక్ష పాఠంలోని కధను సంక్షిప్తంగా రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4
1.సమస్త విద్యలకు వ్యాసుడు గురువు.ఈయనకు పదివేలమంది శిష్యులు వుండేవారు.ఈయన కాసి నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ ,భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు.

2.ఒకరోజు మధ్యాన్నం వేళలో ఆయన భిక్షకోసం శిష్యులతో కలసి బ్రాహ్మణ వాడలలో కి వెళ్ళాడు.ఏవేవో కారణాలతో ,ఎవరూ భిక్ష పెట్టలేదు.

౩.ఆ రోజుకు ఉపవాసం ఉందామని ,మరుసటి రోజు తప్పక భిక్ష దొరుకుతుందని ,వ్యాసుడు నిశ్చయించుకొన్నాడు.
4.ఈస్వరుడి మాయ వల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష వేయలేదు.వ్యాసుడు కోపంతో భిక్ష పాత్రను నడివీధిలో పగులగొట్టి ,కాశివాసులకు మూడు తరాల పాటు దానం,మోక్షం,లేకుండుగాక  అని సపించబోయాడు.
5.ఇంతలో పార్వతి దేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మన గృహం వాకిట్లో ప్రత్యక్షమై ,వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది.
6.అప్పుడు వ్యాసుడు తనకు పదివేలమంది శిష్యులున్నారని ,సూర్యాస్తమయం అవుతున్నదని తన శిష్యులను విడచి తానోక్కడు తినడం తగదని చెప్పాడు.
అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా ఉపవాసమున్నమో ,అలాగే ఈ రోజు కూడా ఉంటామని  దీని అంతరార్ధం.
7.అప్పుడు పార్వతి దేవి నవ్వి,నీవు నీ  శిష్యులన్దరినీ ని వెంట తీసుకోని రా.ఈస్వరుడి దయతో ఎంత మంది వచ్చిన కావలసిన పదార్ధాలు పెడతాను.అని చెప్పింది.
8.వ్యాసుడు సరే అని ,శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు.పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజన శాలలో వారందరికీ భోజనం పెట్టింది.

Similar questions